News August 16, 2024
ఎట్టకేలకు రాజంపేట ఎంపీకి భద్రత పెంపు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు అల్లర్లు జరిగాయి. ఈక్రమంలో ఆయనకు అపాయం పొంచి ఉందని నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయనకు 8 మంది CRPF బలగాలతో బందోబస్తు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సదరు సిబ్బంది గురువారం మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
Similar News
News September 30, 2024
కడప జిల్లాలో ప్రొహిబిషన్ &ఎక్సైజ్ SIల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ SIల బదిలీలను చేపట్టింది. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల ఎక్సైజ్ SIల వివరాలు ఇలా ఉన్నాయి.
కడప- బి కృష్ణకుమార్
సిద్ధవటం- శ్రీ రాజశేఖర్
ఎర్రగుంట్ల- ఏ గోపికృష్ణ
జమ్మలమడుగు- సరితారెడ్డి
ప్రొద్దుటూరు- సివి సురేంద్రారెడ్డి
పులివెందుల- చెన్నారెడ్డి
ముద్దనూరు- విన్నీ లత
మైదుకూరు- ధీరజ్ రెడ్డి
బద్వేల్- సీతారామిరెడ్డి
News September 30, 2024
కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
News September 30, 2024
కడప జిల్లాలో పేలిన డిటోనేటర్.. కారణం?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో <<14229836>>డిటోనేటర్ పేలి VRA మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మైనింగ్ కోసం ఉంచిన డిటోనేటర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.