News March 20, 2025

ఎన్టీఆర్: ‘ఏడాదికి 4,800 బస్సులు ఉత్పత్తి చేస్తాం’

image

విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో బుధవారం ప్రారంభమైన యూనిట్‌లో ఏడాదికి 4,800 బస్సులు ఉత్పత్తి చేస్తామని అశోక్ లేల్యాండ్ సంస్థ ట్వీట్ చేసింది. తమ సంస్థ చరిత్రలో మల్లవల్లి యూనిట్ ప్రారంభించడం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఇక్కడే తమ సంస్థ ఏర్పాటు చేసిన “నలంద”లో లెర్నింగ్ సెంటర్, అడ్వాన్స్డ్ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలిందిస్తామని అశోక్ లేల్యాండ్ Xలో పోస్ట్ చేసింది.

Similar News

News March 21, 2025

MBNR: ప్రభుత్వ ఆస్తులను టచ్ చేస్తే కఠిన చర్యలు: DE

image

చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే చట్టపరమైన కఠినచర్యలు తప్పవని మైనర్ ఇరిగేషన్ DE మనోహర్ హెచ్చరించారు. ఏనుగొండలోని కొర్రంగడ్డ కుంటను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఫిర్యాదులు అందడంతో శుక్రవారం అధికారులతో కలిసి కుంటను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తులను ఆక్రమణలకు గురిచేస్తే ఎంతటి వారైనా సహించబోమని మనోహర్ తెలిపారు.

News March 21, 2025

చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది: అంబటి

image

AP: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే YCP MLAలు సభకు వెళ్లలేదని చెప్పారు. కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందన్నారు. స్కిట్స్‌లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారని, CBN శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు. YSR స్నేహితుడినని చెప్పుకునే ఆయన ఇప్పుడు వైఎస్సార్ జిల్లా పేరు మార్చారని మండిపడ్డారు.

News March 21, 2025

ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి: గద్వాల కలెక్టర్

image

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 20న జోగులాంబ గద్వాల జిల్లా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకం కింద నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులు ఈరోజు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సంతోష్‌ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నియామకం పొందిన అభ్యర్థులు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు.

error: Content is protected !!