News March 5, 2025
ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్ అంబేడ్కర్

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడించడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసినట్లు విజయనగరం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
Similar News
News March 5, 2025
రాజాం: భోజనం చేసి కుప్పకూలిపోయిన యువకుడు

అకస్మాత్తుగా గుండె పోటుతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రాజాం మున్సిపాలిటీ పరిధిలో గాయత్రీ కాలనీకి చెందిన శ్రీనివాస్(30) భోజనం చేసిన కాసేపటికే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 5, 2025
రఘువర్మ ఓటమికి కూటమే కారణం: శంబంగి

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రఘువర్మను గెలిపించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం చేశారని, ఓటమితో గాదె కూడా తమ అభ్యర్థి అనడం విడ్డూరంగా ఉందన్నారు.
News March 4, 2025
చీపురుపల్లిలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

చీపురుపల్లి మెయిన్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో గరివిడి మండలం రేగటికి చెందిన కుడుముల బంగారినాయుడు(32) మృతి చెందాడు. చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతరకు తన స్నేహితుడు శనపతి రాముతో కలిసి వచ్చాడు. జాతర నుంచి తిరగివెళ్తుండగా మెయిన్ రోడ్డులో బైక్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారినాయుడు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.