News April 18, 2024
ఎన్నికల బాధ్యతలు చేపట్టిన ముఖ్య అధికారులు

సార్వత్రిక ఎన్నికల ఖర్చుల పరిశీలనకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించడంతో గురువారం వారు బాధ్యతలు చేపట్టారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సాదిక్ అహ్మద్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ పరిశీలకులుగా యోగేష్ కుమార్, పెద్దాపురం, కాకినాడ, జగ్గంపేట నియోజకవర్గాలకు ఏ.ఆషీఫ్ నియమితులయ్యారు. గురువారం కలెక్టర్ జే.నివాస్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News April 21, 2025
రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యలు పరిష్కారo కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్ అలాగే డివిజన్, మునిసిపల్, మండల కేంద్రంలో ఉదయం 10 నుంచి మ.1 గంట వరకు ప్రజల నుంచి పిజిఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు
News April 20, 2025
రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల

జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్లో జరిగే డీఆర్సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.
News April 20, 2025
రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత

పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు హర్షకుమార్ను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. క్రైస్తవులు, వివిధ సంఘాల నేతలు పాస్టర్ ప్రవీణ్కి నివాళులర్పించారు. పరిస్థితి ఉద్రిక్తత అవ్వడంతో నలుగురు నేతలను అదుపులోకి తీసుకుని రాజనగరం పోలీస్ స్టేషన్కు తరలించారు.