News February 8, 2025

ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వాలంటీర్

image

ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శివ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను మొదటి ప్రాధాన్యత ఓటుకు గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్‌ని అభ్యర్థిస్తున్నాడు. నామినేషన్లు పూర్తయ్యేలోగా ఇంకా ఎంత మంది వేస్తారో చూడాలి.

Similar News

News February 8, 2025

సంచలన వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ సీఎం అవుతారు

image

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఓటమితో డీలా పడ్డ కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత సీఎం భగవంత్ మాన్‌ను కేజ్రీవాల్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. పంజాబ్‌కు హిందూ వ్యక్తి సీఎం అవుతారని రాష్ట్ర AAP అధ్యక్షుడు అమన్ అరోరా కూడా ఇటీవల అన్నారు’ అని బజ్వా గుర్తుచేశారు.

News February 8, 2025

జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం: WGL కలెక్టర్

image

WGL జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద చైర్ పర్సన్ హోదాలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీలతో కలిసి జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

News February 8, 2025

ఏదైనా సమస్య ఉంటే సహచరులతో షేర్ చేసుకోండి: వరంగల్ క్రైం ఏసీపీ

image

వ్యక్తిగతంగాని లేదా శాఖపరమైన ఏదైనా సమస్య ఉంటే సహోద్యోగులతో షేర్ చేసుకుంటే సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుందని వరంగల్ క్రైం ఏసీపీ భోజరాజు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఇటీవల పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్రైం ఏసీపీ పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఒత్తిళ్లకు కంగారు పడకుండా తగిన పరిష్కార మార్గాల కోసం అన్వేషించాలని క్రైం ఏసీపీ తెలిపారు.

error: Content is protected !!