News March 24, 2025
ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి

ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుందంటూ MLC చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. 17 మంది వీసీలను బెదిరించి రాజీనామా చేయించడంపై ఆధారాలు ఇచ్చినా మంత్రి లోకేశ్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు రూ.5,252కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రజలు TDPని గెలిపించి బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 29, 2025
కబ్జా కోరల్లో బ్రిటిష్ కాలం నాటి మార్చురీ.?

ఉదయగిరి RTC డిపో సమీపంలో బ్రిటిష్ కాలం నాటి మార్చురీ భవనం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపించారు. మార్చురీ భవనానికి సంబంధించిన స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లను తొలగించి, చదును చేసి ఆక్రమించేందుకు హద్దు రాళ్లు ఏర్పాటు చేశారన్నారు. విషయం తెలుసుకున్న ఉదయగిరి CHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్.. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News March 29, 2025
ఉగాది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి

శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో ఉగాది వేడుక నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఉగాది వేడుక నిర్వహిస్తామన్నారు.
News March 28, 2025
ఇఫ్తార్ విందులో ఆనం, అజీజ్, కోటంరెడ్డి

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కస్తూరిదేవి గార్డెన్స్లో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి, కలెక్టర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.