News April 7, 2025
ఎమ్మెల్యే గండ్రకు పంచాయతీ కార్యదర్శులు మెమొరాండం అందజేత

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని కార్యదర్శులందరూ బదిలీలు నిలిపివేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్చిన విధంగా కాకుండా నియోజకవర్గంలోని వేరే మండలాలకు బదిలీ చేయాల్సిందిగా అధికారులకు తెలియజేస్తానని చెప్పారు. అలాగే కార్యదర్శులు అందరూ ప్రశాంత వాతావరణంలో ఉద్యోగం చేసేలా హామీ ఇచ్చారు.
Similar News
News April 8, 2025
GST వృద్ధి రేటుపై అబద్ధాలు చెప్పారు: హరీశ్ రావు

TG: GST వృద్ధి రేటుపై Dy.CM భట్టి విక్రమార్క ప్రజలకు అబద్ధాలు చెప్పారని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. ‘2024-25FYలో GST వృద్ధి 12.3%అని Dy.CM అసెంబ్లీలో చెప్పారు. కానీ అధికారికంగా 5.1% అని తేలింది. ఇది జాతీయ సగటు (10%) కంటే చాలా తక్కువ. అలాగే 2025 మార్చిలో 0% వృద్ధి నమోదైంది. దీనికి ప్రభుత్వ వైఫల్యం, అస్థిరమైన నిర్ణయాలు, రైతు భరోసా వంటి హామీలు నెరవేర్చకపోవడమే కారణం’ అని ట్వీట్ చేశారు.
News April 8, 2025
ముస్తాబాద్: 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడెం, నామాపూర్, పోతుగల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో మొత్తం జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
News April 8, 2025
ఆత్మకూరు ప్రైవేట్ ఆసుపత్రిలో విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ

ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళకు డెలివరీ చేసి పసికందును కోసి బయటకు తీశారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఆపరేషన్ చేసిన డాక్టర్లను ఆయన విచారించారు. ఈ ఘటనలో డాక్టర్ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అన్నారు.