News March 11, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థులను చూసి షాకయ్యా: జగ్గారెడ్డి

image

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మైండ్ బ్లాంక్ అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఏం మాట్లాడాలో తెలియని షాక్ లో ఉన్నానాని, తానెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుందని, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను, నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరని పేర్కొన్నారు.

Similar News

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. ‘అధ్యక్షా.. మెదక్ జిల్లాపై దృష్టి పెట్టండి’

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మెదక్ జిల్లాలో అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా మంబోజిపల్లి చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలి. వనదుర్గ ప్రాజెక్ట్ ఎత్తు పెంపు, కాలువల సిమెంట్ లైనింగ్ పూర్తితో పాటు కాళేశ్వరం కాలువలు పూర్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన రామాయంపేట రెవెన్యూ డివిజన్‌లో అధికారిక కార్యక్రమాలు కొనసాగేలా చూడాలి.

News March 12, 2025

మెదక్ జిల్లాలో పోలీస్ హోంగార్డు మృతి

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన పోలీస్ హోంగార్డ్ తలారి మహేందర్(39) మంగళవారం రాత్రి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

News March 12, 2025

మెదక్: మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా ఏఎన్ఎంలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏఎన్ఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. గర్భం దాల్చిన మహిళలు పీహెచ్‌సీ, ప్రభుత్వ ఆసుపత్రులలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!