News September 24, 2024
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోండి: కలెక్టర్ క్రాంతి
ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.
Similar News
News September 29, 2024
రాష్ట్రపతి నిలయం కళా మహోత్సవానికి వర్గల్ నవోదయ విద్యార్థులు
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన అతిపెద్ద కళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు 25 మంది పాల్గొన్నారని ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు భారతీయ కళా మహోత్సవంలో 430 మంది పాల్గొంటున్నారు.
News September 29, 2024
సంగారెడ్డి: DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పొడిగింపు
డీఎస్సీ -2008కి ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పెంచుతున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రభుత్వ పనిదినాలైన సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,3,4,5 తేదీల్లో డిఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
News September 28, 2024
MDK: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్.. నేడు లాస్ట్
డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీ కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయంలో 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 292 మంది అభ్యర్థులు ఉండగా, శుక్రవారం 132 మంది వెరిఫికేషన్కు హాజరయ్యారు. నేడు కూడా ప్రక్రియ కొనసాగనున్నది.