News February 10, 2025
ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘనపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739188126662_51768855-normal-WIFI.webp)
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘనకు పాల్పడిన వారిపై తీసుకున్న చర్యలను రోజువారీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సీ టీమ్స్ (ఎస్ఎస్టీ), వీడియో సర్వేలెన్స్ టీమ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News February 11, 2025
గన్నవరం: మాయమాటలతో బాలికను లోబర్చుకున్న ఆటో డ్రైవర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739246400503_71669201-normal-WIFI.webp)
ఇంటర్ చదివే విద్యార్థిని(మైనర్ బాలిక)ని రోజూ తన ఆటోలో కాలేజీకి తీసుకువెళ్లే ఆటో డ్రైవర్ మాయ మాటలతో లోబర్చుకుని గర్భిణిని చేసిన ఘటన గన్నవరం మండలంలో చోటు చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు సాంబయ్య అనే ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.
News February 11, 2025
గన్నవరం TDP ఆఫీస్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739245526890_51768855-normal-WIFI.webp)
గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్థన్ ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని న్యాయాధికారికి సోమవారం వాంగ్మూలం అందజేశారు. వైసీపీ హయాంలో TDP ఆఫీసుపై ఈ దాడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక TDP ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు. అయితే దాడి సమయంలో తాను అక్కడ లేనని, TDP నేతలు బలవంతంగా కేసు పెట్టించారని అతను ఆరోపించాడు.
News February 11, 2025
పొరపాట్లకు తావు లేకుండా MLC ఎన్నికలు: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739187238263_51768855-normal-WIFI.webp)
ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గ ఎన్నికను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఈనెల 27న జిల్లాలో నిర్వహించే పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీతో కలిసి నోడల్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.