News March 16, 2025
ఎల్ఆర్ఎస్ పై నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ పై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డి నుంచి మున్సిపల్, పంచాయతీ అధికారులతో శనివారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. రోజువారి నివేదికలను తనకు సమర్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 17, 2025
15రోజుల ముందే వార్షిక ఉత్పత్తి సాధించింది: జీఎం

రామగుండం సింగరేణి సంస్థ RG-1 2024- 25 సంవత్సరానికి 36 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 15 రోజుల ముందే సాధించిందని GM లలిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా OCP-5 ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్, అధికారులు, యూనియన్ నాయకులు, సూపర్వైజర్లకు ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
News March 17, 2025
మెదక్: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు: డీఈవో

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాలని సూచించారు.
News March 17, 2025
సిద్దిపేట: దంపతుల ఆత్మహత్య.. అనాథలైన చిన్నారులు

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దంపతులిద్దరూ ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. ఎల్లారెడ్డి పేటకు చెందిన కెమ్మసారం భాగ్యమ్మ (32) ఉదయం పురుగుల మందు తాగే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి మనస్థాపానికి గురైన భర్త నాగరాజు (35) సైతం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు మీనాక్షి (9), మహేష్(7), లక్కీ (5), శ్రావణ్ (4) అనాథలయ్యారు.