News April 19, 2025
ఎల్కతుర్తి సభ చరిత్రలో నిలిచిపోతుంది: ఎమ్మెల్యే పల్లా

ఈ నెల 27న ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సభా వేదికను నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిందని, కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
DSC: కర్నూలు జిల్లాలో పోస్టులు ఇలా..

కర్నూలు జిల్లాలో 2,645 టీచర్ పోస్టులను <<16155948>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 82
➤ హిందీ:114 ➤ ఇంగ్లీష్: 81
➤ గణితం: 90 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 74 ➤ సోషల్: 112
➤ పీఈటీ: 209 ➤ఎస్జీటీ: 1,817 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీష్ 7, మ్యాథ్స్ 4, ఫిజిక్స్ 4, జీవశాస్త్రం 4, సోషల్ 2, పీఈటీ 2, ఎస్జీటీ 10 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.
News April 20, 2025
మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.
News April 20, 2025
సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.