News April 3, 2025
ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి: వెంకటయ్య

ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి సాధించిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ R&B గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై అశ్రద్ధవహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు ఉంటాయన్నారు.
Similar News
News April 10, 2025
కరీంనగర్: కూతురిని చంపి తల్లి సూసైడ్

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 10, 2025
కరీంనగర్ వాసులారా.. మీ పిల్లలపై ఓ కన్నేయండి

వేసవి కాలం వచ్చింది అంటే చాలు చెరువులు, వాగులు, కాల్వల్లో పిల్లలు ఈత కొట్టడాన్ని మనం చూస్తూనే ఉంటాం. వీరిలో వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, సరదా కోసం ఇంకొందరు, ఈత నేర్చుకోవడానికి మరికొందరు వెళ్తుంటారు. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా నీటిలో దిగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఓ కన్నేసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 9, 2025
జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,540 పలకగా.. ఈరోజు రూ.7,520 పలికింది. బుధవారం యార్డుకు రైతులు 75 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,520, కనిష్ఠంగా రూ.7,150 పలికింది. గోనె సంచుల్లో 5 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,600 నుంచి రూ.6,300 వరకు పలికింది. కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు.