News February 26, 2025
ఏడుపాయల జాతరకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్

ఏడుపాయల వన దుర్గ మాత జాతర ఉత్సవాలు పురస్కరించుకొని జాతరలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర బందోబస్తు ఏర్పాటు పరిశీలన చేశారు. జాతర దృశ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీసు రక్షణ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతరకు 883 అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 26, 2025
వెండితెరపై ‘శివుడు’

టాలీవుడ్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణువు పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ స్టార్ హీరోలు అలరించారు. ఎన్టీఆర్(దక్షయజ్ఞం), కృష్ణంరాజు (శ్రీ వినాయక విజయం), శోభన్ బాబు(పరమానందయ్య శిష్యుల కథ), మెగాస్టార్ చిరంజీవి(శ్రీ మంజునాథ), జగపతిబాబు(పెళ్లైన కొత్తలో-సాంగ్లో) భోళా శంకరుడి పాత్రలో కనిపించారు. వీరిలో ఎవరు శివుడి పాత్రలో మెప్పించారో కామెంట్ చేయండి?
News February 26, 2025
గుడివాడ: డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్కు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ చేరేలా చూడాలన్నారు.
News February 26, 2025
చింతలమానేపల్లిలో రూ.19లక్షల మద్యం స్వాధీనం

మండలంలోని గూడెం గ్రామంలో భారీగా మద్యం పట్టుకున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా గూడెం గ్రామంలో తనిఖీలు చేశామన్నారు. గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.19 లక్షల విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం పలువురిపై కేసు నమోదు చేశామన్నారు.