News March 30, 2025
ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి మూల్యాంకన: DEO

పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనను మొత్తం 1,032 మంది సిబ్బంది నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు.ఏప్రిల్ 3 తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే మూల్యాంకనం రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు.111 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 651 మంది ఎగ్జామినర్లు, 270 మంది స్పెషల్ అసిస్టెంట్లను ఇందు కోసం నియమించామన్నారు. ఒక ఎగ్జామినర్ ప్రతిరోజు 40 పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News April 2, 2025
వరంగల్ మార్కెట్లో ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటా ధర రూ.28వేలు, సింగిల్ పట్టికి రూ.28,011 పలికింది. దీపిక మిర్చి క్వింటా ధర రూ.12,500, 1048 రకం మిర్చికి రూ.10వేలు, 5531 మిర్చికి రూ.9వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. .
News April 2, 2025
దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసిన జిల్లా కలెక్టర్

భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం జిల్లాకు వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలిసి స్వాగతం పలికారు. కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ను దేవదాయ శాఖ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
News April 2, 2025
ప్రపంచానికే సాయం.. భారత్ విపత్తు దౌత్యం

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.