News March 6, 2025

ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

image

దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంతత్రి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల బ్రిడ్జి వద్ద లారీని ఢీకొన్న దుర్ఘటన అత్యంత విషాదకరమన్నారు.

Similar News

News March 7, 2025

పంజాబ్ కింగ్స్ న్యూ జెర్సీ చూశారా?

image

ఐపీఎల్ 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. మెటాలిక్ ఎంబ్లమ్, గోల్డ్ కాలర్, గోల్డ్ ఫాయిల్ స్ట్రిప్స్, అథెంటిక్ లేబుల్‌తో జెర్సీ సరికొత్తగా ఉంది. రెడ్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ హెల్మెట్‌తో కిట్‌ను విభిన్నంగా రూపొందించారు. కాగా తమ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆయన జట్టును ముందుండి నడిపించనున్నారు.

News March 7, 2025

మార్చి 7: చరిత్రలో ఈరోజు

image

1921: తెలుగు సినిమా తొలి నేపథ్య గాయకుడు ఎమ్.ఎస్. రామారావు జననం
1938: నోబెల్ గ్రహీత, అమెరికా జీవశాస్త్రవేత్త డేవిడ్ బాల్టిమోర్ జననం
1952: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ జననం
1955: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జననం
1952: ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద మరణం
1979: గ్రంథాలయోద్యమకారుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం

News March 7, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: ADB కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో రోడ్ సేఫ్టీ పై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైతే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!