News February 12, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 638 సెల్ ఫోన్లు రికవరీ

ఏలూరు జిల్లాలో రూ.76 . 56 లక్షలు విలువ చేసే 638 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిశోర్ తెలిపారు. బుధవారం ఏలూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు ఫోన్లను అందచేశారు. సెల్ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. నేరానికి వినియోగించకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు.
Similar News
News January 1, 2026
సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం?

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్కు చెందిన షౌకత్ కరెంట్ షాక్తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News January 1, 2026
KMM: ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కల్లూరులో పర్యటించిన ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, లబ్ధిదారులు నిర్మించుకున్న ఇంటి పురోగతిని బట్టి ప్రతి సోమవారం నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు.
News January 1, 2026
ATP: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులు

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలోని కొందరు బేకరీ షాపుల యజమానులు చేతివాటం ప్రదర్శించారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేపట్టగా తూకాల్లో మోసం వెలుగు చూసింది. 1 కిలో కేక్కి 200 గ్రాములు తగ్గింది. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లులో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కణేకల్లులోని 2 షాపుల్లో రూ.20 వేలు, ఉరవకొండలో 4 షాపుల్లో రూ.41వేలు, విడపనకల్లులో 3 షాపుల్లో రూ. 27వేలు జరిమానా విధించారు.


