News February 28, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు* బ్యాలెట్ పేపర్ల స్ట్రాంగ్ రూమును పరిశీలించిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ✷ ద్వారకాతిరుమల హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు ✷ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ✷పట్టిసీమ వీరేశ్వరునికి రూ.42 లక్షల రికార్డు స్థాయి ఆదాయం * టీ. నర్సాపురం, ఉంగుటూరులో రథోత్సవాలు * 3,14,984 మంది ఓటర్లకు గాను 2,18,902 మంది ఓటు వినియోగం
Similar News
News February 28, 2025
అనకాపల్లి: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి రూ.107.46 కోట్లు

అనకాపల్లి జిల్లాలో మార్చి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.107.46 కోట్లు విడుదల చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశీదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,272 మంది లబ్ధిదారులకు శనివారం పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్ము డ్రా చేస్తారన్నారు.
News February 28, 2025
రాజోలులో అగ్నిమాపక అధికారి మృతి

ఒక్కరోజు డ్యూటీ చేసుంటే పూర్తిగా విశ్రాంతి తీసుకునేవారు. అంతలోనే ఆకస్మికంగా మృతి చెందారు. రాజోలు గాంధీనగర్లో ఉంటున్న అగ్నిమాపక అధికారి బాలకృష్ణ (62) నిన్న ఉదయం మృతిచెందారు. రాజోలు అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్మెన్గా పనిచేసి 3నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. రోజూ మాదిరిగానే బైక్పై డ్యూటీకి వెళ్తుండగా రాజోలులో ఆకస్మికంగా బైక్పై నుంచి పడి చనిపోయారు.
News February 28, 2025
రాష్ట్రంలో 100 కొత్త పోలీస్ స్టేషన్లు?

TG: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రాఫిక్ ఠాణాలతోపాటు మహిళా పీఎస్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలపనుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 844 పీఎస్లు ఉన్నాయి.