News March 14, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷జనసేన జయకేతనం ఆవిర్భావ సభకు పిఠాపురం తరలి వెళ్లిన జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు, కార్యకర్తలు
✷హోలీ సందర్భంగా రంగులు చిమ్ముకొని ఎంజాయ్ చేసిన జిల్లా వాసులు
✷జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుబ్బల మంగమ్మ, రెడ్డి గణపవరం కనకదుర్గమ్మ అమ్మవార్ల జాతర కార్యక్రమాలు
✷మహిళలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు
✷స్మార్ట్ మీటర్లను బిగించవద్దు: సీపీఐ

Similar News

News March 15, 2025

భద్రాద్రి సీతారామ కళ్యాణ మహోత్సవ పనులు ప్రారంభం

image

TG: భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మెుదలయ్యాయి. శుక్రవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా అర్చకులు రోలు రోకలికి పూజచేసి పసుపు కొమ్ములు దంచారు. బియ్యాన్ని తలంబ్రాలుగా చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భద్రాచలం టెంపుల్ ఇన్‌ఫర్మేషన్’ యాప్‌ను ఈవో ఆవిష్కరించారు. యాప్ సేవలు పదిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

News March 15, 2025

బాపట్ల జిల్లాలో ఒంటిపూట బడులు: DEO

image

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. SSC పరీక్షా కేంద్రాలుగా కేటాయించిన పాఠశాలలు మాత్రం పరీక్షలు పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5గంటల వరకు బడి నిర్వహించాలన్నారు.

News March 15, 2025

తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ, రేపు క్యూలైన్ల నిర్వహణ తీరును ఆయన పరిశీలించనున్నారు. ఎల్లుండి నుంచి టీటీడీ, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పాటు గాయపడినవారిని విచారించనున్నారు. ఇప్పటికే ఈ నెల 17న విచారణకు రావాలని కలెక్టర్‌తో పాటు ఎస్పీ, టీటీడీ ఈవోకు నోటీసులు పంపారు.

error: Content is protected !!