News March 20, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఏలూరు (M) పవర్ పేట రైలు ప్రమాదంలో ఒకరు మృతి *భీమడోలులో రైలు నుంచి జారి ఒకరు మృతి *చాట్రాయి (M) చిన్నంపేటలో ఉపాధి కూలీల ఆందోళన *జీలుగుమిల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి.. బోర్డర్ వద్ద బంధువుల ఆందోళన*జీలుగుమిల్లిలో వ్యాన్ బోల్తా*ఏలూరులో సినిమా షూటింగ్ ప్రారంభం*జంగారెడ్డిగూడెం (M) పంగిడి గూడెంలో అగ్నిప్రమాదం *చింతలపూడిలో మహిళ మృతి*టీ.నరసాపురం (M) జగ్గవరంలో గ్రావెల్ ట్రాక్టర్ బోల్తా

Similar News

News March 28, 2025

VZM: శుభలేఖ సుధాకర్, SP శైలజకు జీవిత సాఫల్య పురస్కారం

image

ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్, సినీ నేప‌థ్య గాయని ఎస్పీ శైలజకు కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నామని కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బిఏ నారాయణ తెలిపారు. ఏప్రిల్ 1 న ఆనంద గజపతి కళాక్షేత్రంలో కళా పీఠం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని పద్మభూషణ్, గానకోకిల పి.సుశీల పాల్గొంటారన్నారు.

News March 28, 2025

రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

image

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.

News March 28, 2025

సీతంపేట : మంచంపై నుంచి పడి విద్యార్థి మృతి

image

సీతంపేట మండలం దోనుబై ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న చలపతి శుక్రవారం మృతి చెందాడు. హాస్టల్‌లో తన బెడ్ నుంచి కిందికి దిగేప్పుడు కాలు జారిపడ్డాడు. ప్రమాదంలో చెవి భాగం వైపు గట్టిగా తగలటం వలన రక్తం రావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తన తోటి స్నేహితులు చెప్తున్నారు. దోనుబై S.I ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిది కారెంకాగుమానుగడుగా సమాచారం.

error: Content is protected !!