News March 19, 2025
ఏలూరు జిల్లాలో రూ.13,277 కోట్లు రుణాలు

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ వరకు రూ.6,639 కోట్లు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు అందించారని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి రూ.15,778 కోట్లకు ఇంతవరకు 13,277 కోట్లు రుణాలు అందించారని, మార్చి చివరినాటికి 100% లక్ష్యాలను సాధించాలన్నారు. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం సీడీ రేషియో ప్రమాణం కనీసం 60% ఉండాల్సి ఉండగా, జిల్లాలో ఇది 199%గా ఉండటం మంచి పరిణామమన్నారు.
Similar News
News March 20, 2025
వారి ఉపాధి పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: జనసేన

AP: కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు సమస్య తీవ్రం కావడానికి రాజకీయాలే కారణమని పేర్కొంది. నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో చెరువు గట్లను పేల్చేసిందని దుయ్యబట్టింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం తమదని తెలిపింది.
News March 20, 2025
రాష్ట్రంలోనే జమ్మికుంట, హుజూరాబాద్ టాప్

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ అయాజ్ పేర్కొన్నారు. ఈ ఘనత మున్సిపల్ ప్రజలు, సిబ్బంది వల్లే సాధ్యమైందని ఇరువురు తెలిపారు.
News March 20, 2025
గుంటూరు: పోలీస్ స్టేషన్కు చేరిన ప్రేమ వ్యవహారం

పొన్నెకళ్లుకు చెందిన నాగమల్లేశ్వరరావు(24) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేసి అరండల్ పేటలోని లాడ్జిలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తనను కొట్టి యువతిని తీసుకెళ్లారని నాగమల్లేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అరండల్ పేట సీఐ వీరస్వామి తెలిపారు.