News February 9, 2025
ఏలూరు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739064527695_52277921-normal-WIFI.webp)
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రోగ్రాం నిలిపివేశామని, ప్రజలు గమనించాలని సూచించారు.
Similar News
News February 10, 2025
చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739112963639_1280-normal-WIFI.webp)
సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
News February 10, 2025
చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739093697607_1280-normal-WIFI.webp)
సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
News February 10, 2025
బొబ్బిల్లంక: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739149550717_1221-normal-WIFI.webp)
సీతానగరం మండలం చిన్నకొండేపూడి చెందిన దంతె ప్రసాద్ (24) బొబ్బిలంక వద్ద ప్రమాదవశాత్తు ట్రాలీ వెనుక చక్రంలో పడి ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం బంధువులు ఇంటికి వెళ్లి తిరిగి బైక్పై వస్తు బొబ్బిల్లంక వద్ద ట్రాలీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.