News October 7, 2024
ఏలూరు: మ్యాట్రిమోనిలో పరిచయం.. 4 పెళ్లిళ్లు.. చివరికి అరెస్ట్
మ్యాట్రిమోనీ ద్వారా సేకరించిన వివరాలను ఆధారంగా చేసుకుని పెళ్లిచూపుల పేరుతో ఇప్పటివరకు 4 వివాహాలు చేసుకున్న ఆశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డిని సోమవారం ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ రెడ్డితో పాటు సహకరించిన తుంగ శశాంక పల్లె హేమంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
Similar News
News October 7, 2024
ఏలూరు జిల్లాలో యువతకు ఉచిత శిక్షణ
ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DLTC ప్రధానాచార్యుడు ఎస్.ఉగాది రవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఆఫీసు అపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో 4 నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్ ఆపైన చదివిన వాళ్లు, 15 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News October 7, 2024
ఇసుకపై ఏలూరు జేసీ కీలక ప్రకటన
ఏలూరు జిల్లాలో ప్రస్తుతం నెలకు సరిపడా ఇసుక ఉందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి జేసీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టిసీమ, గూటాల, గూటాల-1 డీ-సిల్టేషన్ పాయింట్స్ ద్వారా త్వరలో ఇసుక అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఇసుక విషయంలో సమస్యలు ఎదురైతే 88865 42999, 95339 22444, 9493040757కు కాల్ చేయవచ్చని సూచించారు.
News October 7, 2024
ప.గో.: నేటి నుంచి ప్రత్యేక రైలు
దసరా పండగను పురస్కరించుకుని నేటి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ఏలూరు రైల్వే
స్టేషన్ ఇన్ఛార్జి రమేశ్ తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, విజయవాడ, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్కు, 7, 8, 9వ తేదీల్లో విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి అనపర్తి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పొందూరు మీదుగా శ్రీకాకుళం వరకు నడపనున్నారన్నారు.