News March 1, 2025

ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.

Similar News

News March 1, 2025

MBNR: యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.!

image

సదరం గుర్తింపు కార్డు కోసం యుడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు. సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లతో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News March 1, 2025

గర్భిణులు, వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దు: APSDMA

image

APలో 3 నెలలపాటు ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని <>APSDMA<<>> వెల్లడించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటికెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి, లెమన్ వాటర్ తాగాలని సూచించింది. ఎండలపై సమాచారం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలంది.

News March 1, 2025

యూట్యూబ్ రూమర్లను నా భార్యకు పంపుతున్నారు: అనిల్ రావిపూడి

image

యూట్యూబ్‌లో వ్యూస్ కోసం రూమర్లు క్రియేట్ చేసే వారిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు. మీనాక్షి చౌదరితో తనకు కెమిస్ట్రీ బాగుంటుందని యూట్యూబ్‌లో ఈ మధ్య రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ఆ రోతను సన్నిహితులు తన భార్యకు పంపి ఇదేంటని అడుగుతున్నట్లు చెప్పారు. లేనివి సృష్టించి తాత్కాలికంగా లాభపడ్డా, అవి జీవితాలను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలన్నారు.

error: Content is protected !!