News March 13, 2025

ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదంలో తోబుట్టువులకు పుత్ర శోకం

image

ఐ.పోలవరం మండలం ఎదురులంక వారధిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తోబుట్టువుల కొడుకులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముమ్మిడివరం M కొత్తలంకకు చెందిన సాంబశివ (14), తాళ్ళరేవు M సుంకరపాలానికి చెందిన వీరేంద్ర (18) మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ పై వస్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సాంబశివ 9వ తరగతి చదువుతుండగా వీరేంద్ర మినీ ఆటో యజమాని.

Similar News

News March 14, 2025

HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.

News March 14, 2025

రోహిత్ శర్మపై వరుణ్ ప్రశంసలు

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కెప్టెన్ రోహిత్ శర్మ తనను చక్కగా ఉపయోగించుకున్నారని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పారు. ‘పవర్ ప్లేలో 2 ఓవర్లు, చివర్లో 2, 3 ఓవర్లు, మిడిల్ ఓవర్లలో వికెట్ కావాల్సినప్పుడు బౌలింగ్ చేస్తాను. ఇదే నా బలం అని రోహిత్ శర్మతో చెప్పాను. ఆయన మరో మాట మాట్లాడకుండా నేను చెప్పింది అర్థం చేసుకున్నారు. రోహిత్ శర్మ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకరు’ అని వరుణ్ ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు.

News March 14, 2025

HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.

error: Content is protected !!