News May 17, 2024
ఐసెట్’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా, ఈసారి ఇప్పటివరకు 80,723 వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. ఈ నెల 17 వరకు రూ.250 రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉండగా, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 27 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
Similar News
News April 24, 2025
హనుమకొండ: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

HNK ఆర్ట్స్ కాలేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల ప్రకారం.. హసన్పర్తి(M) కోమటిపల్లికి చెందిన అభిషేక్(18) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, కారులో స్నేహితులతో బయటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో అభిషేక్ స్పాట్లోనే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
News April 24, 2025
పరకాల: కొడుకుని చంపిన తండ్రి ARREST

కొడుకుని చంపిన తండ్రిని చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. రేపాకపల్లికి చెందిన ఓదెలు పరకాల మండలం సీతారాంపురంకు చెందిన దేవిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో తండ్రి మొండయ్య కొడుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఓదెలు పెళ్లి రోజు మళ్లీ గొడవ జరిగింది. ఈ నెల 22న పడుకున్న ఓదెలుపై మొండయ్య రోకలి బండతో కొట్టి హత్య చేసి పారిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News April 24, 2025
మామునూరు ఎయిర్పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా..?

WGL మామునూరు ఎయిర్పోర్ట్ను నిజాం పాలనలో 1930లో నిర్మించారు. జవహర్ లాల్ నెహ్రూతో సహా అనేకమంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు 1981 వరకు వారి పర్యటనలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడింది. ఈ విమానాశ్రయం షోలాపూర్లో వ్యాపారాభివృద్ధికి, సిర్పూర్ కాగజనగర్లో కాగితం పరిశ్రమ సౌకర్యార్థం నిర్మించారు. ఇది బేగంపేట విమానాశ్రయం కంటే అతి పురాతనమైంది. మామూనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.