News March 29, 2024
ఒంగోలు ఎంపీ టిడిపి అభ్యర్థి మాగుంట రాజకీయ నేపథ్యం
ఒంగోలు ఎంపీ టిడిపి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈయన 2014 టిడిపిలో చేరి ఒంగోలు టిడిపి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 టిడిపికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరి 2019 ఒంగోలు ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2024లో ఫిబ్రవరిలో వైసిపి పార్టీకి రాజీనామా చేసి మార్చి 16న 2024న మళ్లీ టిడిపిలో చేరారు. జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి అందరికీ సుపరిచితమే.
Similar News
News September 29, 2024
ప్రకాశం జిల్లాలో నూతన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు వీరే
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ఎక్సైజ్ శాఖ స్టేషన్లకు ఇన్స్పెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
➤ ఒంగోలు – A. లినా
➤ మార్కాపురం – వెంకటరెడ్డి
➤ చీమకుర్తి – M. సుకన్య
➤ సింగరాయకొండ – M. శివకుమారి
➤ పొదిలి – T. అరుణకుమారి
➤ దర్శి – శ్రీనివాసరావు
➤ కనిగిరి – R. విజయభాస్కరరావు
➤ గిద్దలూరు – M. జయరావు
➤ కంభం – కొండారెడ్డి
➤ యర్రగొండపాలెం – CH శ్రీనివాసులు
➤ కందుకూరు – వెంకటరావు
News September 29, 2024
బూచేపల్లి బాధ్యతల స్వీకరణకు.. డేట్ ఫిక్స్.!
ప్రకాశం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లాలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం తెలిపారు.
News September 29, 2024
పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే ధ్యేయం: ప్రకాశం ఎస్పీ
పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే తమ ధ్యేయమని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు అధికారులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లచే 474 మందికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స చేసి ఉచితంగా మందులు అందించారు.