News June 20, 2024
ఒంగోలు: దోపిడీ కేసులో నిందితులు అరెస్ట్
దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఏఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. గురువారం ఒంగోలులోని SP కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండపి మండలం వెన్నూరునకు చెందిన వంశీకృష్ణ తన బంధువుల ఫంక్షన్ నిమిత్తం ఈనెల 16న ఒంగోలు వచ్చారు. వంశీకృష్ణ కుమారుడు జయవర్ధన్ బాబును ఇద్దరు నిందితులు ఫంక్షన్లో మాయమాటలతో చెయిన్, బ్రాస్లెట్, ఉంగరం దొంగిలించారు. ఈమేరకు పోలీసు బృందాలతో పట్టుకున్నామన్నారు.
Similar News
News October 4, 2024
ప్రకాశం: బైక్ టైర్లో చున్నీ ఇరుక్కుని.. మహిళ మృతి
సంతమాగులూరు మండలం ఏల్చూరులోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్ వెనుక టైర్లో చున్నీ చుట్టుకోవడంతో రోడ్డు మీదపడి బల్లికువ మండలం కొప్పెరపాడుకు చెందిన మహిళా అక్కడకక్కడే మృతి చెందింది. నరసరావుపేట నుంచి కొప్పెరపాడు వైపు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
News October 4, 2024
ప్రకాశం: ‘ఇసుక తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి’
ప్రకాశం జిల్లాలో ఇసుక భూములకు సంబంధించి పట్టాదారులు, డీకేటీ పట్టాదారులు ఇసుక తవ్వకాల అనుమతి కోసం తరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టెట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలు, రవాణా సంబంధిత సరిహద్దు గ్రామాల పరిధిలో జరగాలన్నారు. ప్రక్రియకు స్థానిక వీఆర్ఓ, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు బాధ్యత వహించాలన్నారు.
News October 4, 2024
ప్రకాశం: ‘బాణసంచా విక్రయాలకు దరఖాస్తు చేసుకోవాలి’
ప్రకాశం జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత శుక్రవారం తెలియజేశారు. ఆసక్తికలిగిన వారు తాత్కాలిక లైసెన్స్ కోసం ఈనెల 15లోగా మీసేవ కేంద్రాలు, సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తహశీల్దార్లు, పోలీసు అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించి దీపావళి బాణసంచాను విక్రయించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.