News February 6, 2025
ఒక్క మెసేజ్తో స్పందించిన కోనసీమ కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738847499524_52165958-normal-WIFI.webp)
ఐ.పోలవరం మండలం జి.మూలపాలెం జడ్పీ స్కూలుకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి 95 మంది విద్యార్థులు వస్తుంటారు. రోజూ పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరి అవస్థలను HM జనార్ధనరావు వాట్సాప్ ద్వారా డీఈవో బాషాకు మెసేజ్ చేశారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు కావాలని కోరారు. కలెక్టర్ మహేశ్ కుమార్తో డీఈవో మాట్లాడారు. 3 రోజుల్లోనే 95 మందికి లైఫ్ జాకెట్లు సమకూర్చారు.
Similar News
News February 7, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738516367269_695-normal-WIFI.webp)
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
తాత్పర్యం: నేలమీద పచ్చికాయలను ఏరుకుని తినవద్దు. బంధువులను, ప్రజలను దూషించవద్దు. యుద్ధము నుంచి వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు.
News February 7, 2025
MHBD: మానవత్వం పరిమళించిన వేళా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738854586703_20521483-normal-WIFI.webp)
మహబూబాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన విశ్రుతప్రియాన్సిని అనే చిన్నారి క్యాన్సర్ సంబంధింత వ్యాధితో బాధడుతుండగా.. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేయాల్సి ఉంది. చిన్నారి తల్లిదండ్రులు ఆర్థిక స్థోమతకు మించి వైద్యం చేయించారు. ఇకపై వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో దాతల సహాయం కోరారు. ఈ క్రమంలో పట్టణ కేంద్రానికి చెందిన షకీల్ అనే వ్యక్తి స్పందించి రూ.50 ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.
News February 7, 2025
అవినీతి బ్రహ్మరాక్షసి లాంటిది: జస్టిస్ ఎన్వీ రమణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738864323350_695-normal-WIFI.webp)
నిజాయితీ కూడిన మేధావులు దేశానికి కావాలని మాజీ CJI జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ప్రస్తుతం వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా మారి వారితో అవినీతి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి బ్రహ్మ రాక్షసి లాంటిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రజలు వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతున్నారన్నారు. పిల్లలకూ రాజకీయాలపై అవగాహన కల్పించాలని సూచించారు.