News March 21, 2025
ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీలు సహకరించాలి: MBNR కలెక్టర్

ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా మార్పులు, చేర్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఒంటరిగా నమోదు చేసుకోవాలని, ఇందుకు వారు సహకరించాలన్నారు. మార్పులు చేర్పులతోపాటు తప్పులు లేని జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 31, 2025
WOW: జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ విద్యార్థిని

ఉమ్మడి పాలమూరు జిల్లా కర్ని (ZPHS) పాఠశాల విద్యార్థిని వై.శశిరేఖ 57వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పీడీ బి.రూప తెలిపారు. జనవరి 9, 10, 11న వరంగల్ జిల్లాలోని గీసుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఒడిశాలోని పూరిలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే టోర్నీలో పాల్గొననున్నారు. దీంతో పాఠశాల హెచ్ఎం వెంకటయ్య,ఉపాధ్యాయులు అభినందించారు. CONGRATS❤
News March 31, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

❤కనిపించిన నెలవంక.. రేపే రంజాన్❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు❤’రంజాన్ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం’❤ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు❤జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి❤సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:SIలు❤గద్వాల: చట్నీలో బల్లి❤బల్మూర్: జిల్లా స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు❤గ్రామాల్లో పంచాంగ శ్రవణం❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
News March 30, 2025
NGKL: దిగుబడి రాలేదని కౌలు రైతు ఆత్మహత్య

మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిరుమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనమోని శ్రీనివాసులు అనే రైతు కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో మామిడి తోటను కౌలు చేస్తున్నాడు. దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.