News May 11, 2024
ఓటర్ స్లిప్పు రాలేదా.. ఆందోళన వద్దు
ఖమ్మం: ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఓటర్ స్లిప్పు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే స్లిప్పు రాకుండా ఒక ఎస్ఎంఎస్ తో పోలింగ్ బూతులో ఓటు ఉందో లేదో సులభంగా తెలుసుకొని అవకాశం ఉంది. ఓటరు తన ఫోను నుంచి ఈ సీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ కార్డు నెంబరు నమోదు చేసి 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు మెసేజ్ పంపించాలి. వెంటనే పోలింగ్ బూత్ నెంబర్ ఓటర్ జాబితాలోని క్రమసంఖ్య వివరాలతో మెసేజ్ వస్తుంది.
Similar News
News October 2, 2024
రేపటి నుంచి ఈ రైళ్లు పునః ప్రారంభం
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గత నెలలో తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్లను ఈనెల 3 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ (11020/11019), ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (12706/12705) భద్రాచలం రోడ్ ప్యాసింజర్ పునః ప్రారంభం ఎక్స్ప్రెస్ చెప్పారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
News October 2, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక ప్రజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News October 2, 2024
ఖమ్మం: నేడు గాంధీ జయంతి.. ఈ దుకాణాలు బంద్
నేడు గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చికెన్, మటన్, ఫిష్, వైన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు బెల్టు షాపులు, మరోవైపు మాంసం దుకాణాలు దొంగచాటుగా మద్యం, మాంసాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయి.