News March 16, 2025
కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన కలెక్టర్

కొమురవెల్లి మండలం గురువన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేసిన ఎఐ (ఆర్టిఫిషల్ ఇంటిలీజెన్స్) కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో ప్రారంభించిన FLN(ఫౌండేషన్ లిటరసీ న్యూమారసి) ప్రోగ్రాం ద్వారా పాఠశాల విద్యార్థుల గణిత, తెలుగు అభ్యసన సామర్ధ్యం పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు.
Similar News
News March 16, 2025
KMR: పేదరికాన్ని జయించాడు. సర్కార్ నౌకరి సాధించాడు

గాంధారి మండలం నేరాల తాండకు చెందిన బర్దవాల్ మెగరాజ్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పేదరికంలో పుట్టి పెరిగిన మెగరాజ్ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కష్టపడి ప్రభుత్వ అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు దోమకొండలో ప్రభుత్వ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. కాగా మెగరాజ్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే విద్యనభ్యసించాడు.
News March 16, 2025
NLG: డ్రైవింగ్ కోర్సుకు దరఖాస్తు ఆహ్వానం

మోటార్ డ్రైవింగ్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు BC సంక్షేమ అధికారి నజీం అలీ తెలిపారు. HYD హకీం పేటలో హెవీ మోటార్, లైట్ మోటర్ డ్రైవింగ్ నేర్పుతామన్నారు. 38 రోజులపాటు ఉచిత తర్వాత అర్హత ఉన్నవారికి ఉచితంగా పర్మినెంట్ లైసెన్స్ ఇస్తారని తెలిపారు. 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 16, 2025
రాజమండ్రి: అమెరికా నుంచి వచ్చానని అమ్మాయిలకు వల

అమ్మాయిలను మ్యాట్రిమోనీ, షాదీ డాట్కాం ద్వారా మోసగిస్తున్న రాజమండ్రికి చెందిన వంశీకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అమెరికా నుంచి వచ్చానని, ఎన్నారైలను, రెండో పెళ్లికోసం చూస్తున్న వారి వద్ద డబ్బులు కాజేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగిన వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. వంశీపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి.