News September 28, 2024
కడప అమ్మాయికి అవార్డు
కడప పట్టణానికి చెందిన ఇందిరా ప్రియదర్శిని ఉత్తమ సోషల్ మీడియా పురస్కారం అందుకున్నారు. శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల మీద సామాజిక మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.
Similar News
News October 10, 2024
కడపలో వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా
గంజాయి నిర్మూలనకు కడప జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. కడప నగరంలో గంజాయి తాగే ప్రాంతాల్ల ఇకపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టనున్నారు. ఇలా ఎవరైనా ఈ కెమెరా కంటపడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే నగరంలోని కొన్ని కొరియర్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు చేశారు.
News October 10, 2024
ఎగ్జిబిషన్లు సృజనాత్మక ఆలోచనలను చిగురింపజేస్తాయి: కడప కలెక్టర్
పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలు చిగురింపజేయడానికి స్పేస్ వీక్- 24 లాంటి ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడుతాయని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇస్రో, ఇతర విద్యా సంస్థలు నిర్వహించిన ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి బుధవారం కలెక్టర్ హాజరయ్యారు. వివిధ అంశాలపై జరిగిన కాంపిటీషన్స్ విజేతలకు ఆయన జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
News October 9, 2024
ముద్దనూరు వద్ద రైలు ఢీ.. యువకుడు మృతి
రైలు కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ముద్దనూరులో చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామిరెడ్డి వివరాల ప్రకారం.. ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో రైలు కిందపడి గుండి నాగేంద్ర (22) మృతి చెందాడు. ఇతను డ్రైవర్గా జీవనం సాగిస్తారన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల విరాలు తెలియాల్సిఉంది.