News July 2, 2024
కడప: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
సీకేదిన్నె మండలంలోని అంగడి వీధికి చెందిన దూదేకుల మహబూబ్ చాంద్(17)అనే విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సీకేదిన్నె సీఐ శివ శంకర్ నాయక్ తెలిపారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగిగా.. ఏలూరులో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News October 9, 2024
గొప్ప మనసును చాటుకున్న కడప జిల్లా కలెక్టర్
ఫిర్యాదుల పట్ల తక్షణ సహాయ సహకారాలు అందిస్తూ కడప కలెక్టర్ శివశంకర్ గొప్ప మనసును చాటుకుంటున్నారు. దువ్వూరు మండలం క్రిష్ణంపల్లికి చెందిన పి. భాగ్యలక్ష్మి తాను ఒంటరి మహిళనని, తనకు సపరేటుగా రేషన్ కార్డు సదుపాయం కల్పించాలని, రేషన్ కోటా తీసుకోలేక పోతున్నానని కలెక్టర్కు విన్నవించారు. రేషన్ కార్డు సపరేషన్ ఆప్షన్ లేదని, అంతవరకు తన సొంత ఖర్చుతో బియ్యం, సరుకులు అందిస్తామని చెప్పి వెంటనే ఆమెకు అందించారు.
News October 9, 2024
కాక పుట్టిస్తున్న జమ్మలమడుగు రాజకీయం
రెండు రోజుల నుంచి జమ్మలమడుగు రాజకీయం వేడి వాడిగా సాగుతోంది. సుధీర్ రెడ్డి వైడ్ బాల్, MLC రామసుబ్బారెడ్డి నో బాల్ అని MLA ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు. దీనికి ఎమ్మెల్యే ఆది అధికారం ఉంటేనే పులి, అధికారం లేకపోతే పిల్లిలా ఉంటాడంటూ రామసుబ్బారెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. వీళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే 2009 ఎన్నికలు గుర్తుకువస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. వీళ్ల వ్యాఖ్యలపై మీ కామెంట్..
News October 8, 2024
సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయాలి: కడప కలెక్టర్
కడప జిల్లాల్లో గ్రామ సభల్లో ఆమోదిందించిన పల్లె ప్రగతికి ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను వచ్చే సంక్రాంతి లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సభలు, పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు తదితర అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ నెల 14వ తేది నుంచి 20వ తేది వరకు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.