News April 9, 2024
కడప: కదిలే రైలు ఎక్కుతుండగా ప్రమాదం

కడప రైల్వే స్టేషన్లో కేరళకు చెందిన అధిలా(22) అనే వైద్య విద్యార్థి గాయపడ్డాడు. నీటి కోసం రైలు దిగాడు. తిరిగి ఎక్కడానికి ప్రయత్నించగా అప్పటికే రైలు కదిలింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. గమనించిన తోటి ప్రయాణికులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఎడమ మోకాలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 8, 2025
కడప: ‘మహానాడును విజయవంతం చెయ్యండి’

మహానాడును విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. సోమవారం కడప నగరంలో వివిధ చోట్ల మహానాడు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సమన్వయంతో పనిచేసి, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యలని సూచించారు.
News April 7, 2025
ఒంటిమిట్ట: అధికారులకు మంత్రుల దిశానిర్దేశం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవితలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన మందిరంలో సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
News April 7, 2025
కడప: నదిలో యువకుడి గల్లంతు

కడప నగర సమీపాన ఉన్న వాటర్ గండిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని రియాజ్ థియేటర్ సమీపంలోని సమీర్ (17) తన స్నేహితులతో కలిసి ఈత కోసం ఆదివారం పెన్నానదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ అందులో మునిగారు. స్థానికులు గమనించి అందులో ఇద్దరిని కాపాడారు. సమీర్ కనిపించలేదని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.