News October 4, 2024
కడప: కుడా వైస్ ఛైర్మన్గా అదితి సింగ్
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
Similar News
News October 4, 2024
కడప: అధికారుల పేరుతో నగదు వసూలు.. తస్మాత్ జాగ్రత్త
కడప జిల్లాలో ఉన్నతాధికారుల పేరుతో సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నాడని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శివ శంకర్ సూచించారు. ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల పేరు, ఫోటో పెట్టి వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించి అత్యవసరంగా డబ్బు పంపాలని మెసేజ్లు పంపిస్తున్నారన్నారు.
ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ డబ్బు కానీ పంపాలని ఎప్పుడు అడగరనేది తెలిపారు.
News October 4, 2024
కడప JC అదితి సింగ్కి మరో కీలక పదవి
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
News October 4, 2024
కమలాపురం: భూ తగాదాల్లో తోపులాట.. వ్యక్తి మృతి
కమలాపురం మండల పరిధిలోని అప్పారావుపల్లెలో భూ తగాదాల కారణంగా ఇరు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఈ తోపులాటలో శీలం కృష్ణారెడ్డి (65) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బావా బామర్దుల మధ్య భూమి విషయంలో జరిగిన వాదనలు తోపులాటకు దారితీశాయి. ఈ సందర్భంలో కృష్ణారెడ్డికి ఒక్కసారిగా చాతినొప్పి రావడంతో కిందపడ్డారు. వెంటనే కమలాపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.