News March 27, 2025
కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు సహకారం అందించిన ఉమ్మడి కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్, జగన్ మీద అభిమానంతో రామ గోవింద్ రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించారని అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల పట్ల జిల్లా పరిధిలోని ZPTCలు పోరాటం కొనసాగించాలని సూచించారు.
Similar News
News April 1, 2025
కడపలో హిజ్రాల ఆందోళన

పదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరారు. ఈ మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 50మందికి పైగా హిజ్రాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ రామకృష్ణ జోక్యం చేసుకుని విచారించి న్యాయం చేస్తామన్నారు. ఆయన హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు.
News April 1, 2025
బ్రహ్మంగారిమఠంలో ఇరువర్గాల దాడి

బ్రహ్మంగారిమఠం గ్రామంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. భూతగాదాతో ఘర్షణ జరిగింది. మల్లికార్జున్ రెడ్డి, జయరాం రెడ్డి, అతని తండ్రిపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యుల పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News April 1, 2025
కడప జిల్లాలో కరవు మండలాలు ఇవే..!

రాష్ట్ర వ్యాప్తంగా కరవు మండలాలను గుర్తిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం కడప జిల్లాలో 10 మండలాల్లో కరవు ఉందని తేలింది. దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, అవధూత కాశీనాయన, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైలవరం, తొండూరు, మైదుకూరును కరవు మండలాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులు రాగా.. ఆయా మండలాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.