News March 24, 2024
కడప జిల్లాలలో నంద్యాల వాసి బలవన్మరణం
నంద్యాలకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లాలో రెండు చేతులు బ్లేడుతో కోసుకుని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇతను గోనెగండ్లలో పని చేసేవారు. ఇటీవల ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. మనస్తాపానికి గురైన ఆయన ఇంటికి వెళ్లకుండా ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో అద్దెకు దిగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ ను గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 6, 2025
TG భరత్కు 15వ ర్యాంకు
మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు ఫైళ్లను త్వరగా క్లియర్ చేసిన వారికి మెరుగైన ర్యాంకు లభించింది. ఈక్రమంలో కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్కు 15వ ర్యాంకు లభించింది. నంద్యాలకు చెందిన ఫరూక్కు మొదటి ర్యాంకు, బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు లభించింది.
News February 6, 2025
‘కోడుమూరు మాజీ MLAపై చీటింగ్ కేసు పెడతాం’
కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేయాలని అదే పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నిధులను మురళీకృష్ణ దారి మళ్లించే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, నేతల కళ్లుగప్పి ఆయన తన సొంత సొసైటీ ఏర్పాటు చేసి నిధులు కాజేయాలని చూశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అని లక్ష్మీ నరసింహ చెప్పారు.
News February 6, 2025
విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్
పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలను పంపాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను కోరారు. బుధవారం పాఠశాలల బలోపేతం- రీస్ట్రక్చరింగ్ అంశంపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వలసకు వెళ్లే విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అన్నారు. పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.