News April 24, 2025

కడప: నోటిఫికేషన్ విడుదల

image

ఏపీలో టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు, ఇడుపులపాయ ఐఐఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 24, 2025

కొత్తగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

image

మత్స్యకారుల వలకు మొసలి చిక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువులో జరిగింది. గురువారం కొందరు వ్యక్తులు చేపలు పట్టడానికి వెళ్లగా, వలలో మొసలి ప్రత్యక్షమైంది. భయాందోళనకు గురైన స్థానికులు విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని గోదావరి నదిలో విడిచిపెట్టారు.

News April 24, 2025

PLAYOFFS: ఏ జట్టుకు ఎంత ఛాన్స్ అంటే?

image

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌‌కు ప్లే‌ఆఫ్స్‌ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జట్టుకు 91% ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. అతి తక్కువగా CSKకు 0.8 శాతం మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ(85%), బెంగళూరు(62%), పంజాబ్(58%), ముంబై(51%), లక్నో(34%), కోల్‌కతా(15%), రాజస్థాన్(2%), హైదరాబాద్(1%) ఉన్నాయి.

News April 24, 2025

‘రెట్రో’ కథ ఆ హీరో కోసం అనుకున్నా: కార్తీక్ సుబ్బరాజు

image

‘రెట్రో’ సినిమా కథను దళపతి విజయ్ కోసం రాశారన్న ప్రచారంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్పందించారు. రజినీకాంత్ కోసం ఈ స్టోరీ రాసుకున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేశానని తెలిపారు. సూర్య రావడంతో పలు మార్పులు చేసినట్లు చెప్పారు. సినిమాలో రొమాంటిక్ డ్రామాను జోడించినట్లు పేర్కొన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

error: Content is protected !!