News March 23, 2025

కనిగిరి: బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు లోకేశ్.. ఎప్పడంటే.!

image

AP ప్రభుత్వం క్లీన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా.. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ ఏప్రిల్ 2న శంకుస్థాపన చేస్తారు.

Similar News

News March 26, 2025

ప్రకాశం: పాఠశాలల్లో వాటర్ బెల్..!

image

ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమం నిర్వహిస్తామని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 10, 11, 12 గంటల సమయాల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ నిర్వహించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు.

News March 26, 2025

ప్రకాశం: వైసీపీకి మరో షాక్ తప్పదా..?

image

ప్రకాశం జిల్లాలో YCPకి షాక్ ఇచ్చేందుకు TDP పావులు కదుపుతోంది. మార్కాపురం, త్రిపురాంతకం MPP ఎన్నిక గురువారం జరగనుంది. పుల్లలచెరువులో వైస్ MPP, ఎర్రగొండపాలెంలో కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక సైతం నిర్వహిస్తారు. అన్ని చోట్లా YCPకి పూర్తి మెజార్టీ ఉన్నా ఆయా స్థానాలను దక్కించుకోవడానికి TDP గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కొందరు స్వచ్ఛందంగా టీడీపీ గూటికి చేరగా.. మరికొందరిని కొన్ని హామీలతో తమవైపు తిప్పుకుంటోంది.

News March 26, 2025

జగన్‌ను కలిసిన ఆళ్ల సతీమణి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డిని అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వైసీపీ అధినేత జగన్‌ను ఆంజనేయరెడ్డి సతీమణి సుబ్బమ్మ కలిశారు. పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె జగన్ వద్ద వాపోయారు. పార్టీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బూచేపల్లి ఫ్యామిలీ, చెవిరెడ్డి ఉన్నారు.

error: Content is protected !!