News March 14, 2025
కన్నాయిగూడెం: అస్వస్థతకు గురై కూలి మృతి

మిర్చి తోటకు పురుగుమందు పిచికారి చేస్తుండగా, అస్వస్థతకు గురై ఓ కూలి మృతి చెందిన ఘటన కన్నాయిగూడెంలో జరిగింది. ఎస్సై వెంకటేష్ వివరాలు.. చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రాకేశ్ అనే వలస కూలి గురేవుల గ్రామంలోని సంతోష్ అనే రైతుకు పనికి వచ్చాడు. మిర్చి తోటలో పురుగుమందు పిచికారి చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కూలీలు వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News December 17, 2025
ఎచ్చెర్ల: ‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన’

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని AP మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీని ఆమె సందర్శించారు. మహిళా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పిల్లల రక్షణకు కూడా పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.
News December 17, 2025
గద్వాల్: కోర్టు భవన స్థల ఎంపికకు కమిటీ ఏర్పాటు

గద్వాల జిల్లా కోర్టు భవన స్థలం ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు అడ్వకేట్ టి మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థలం ఎంపిక కోసం సీనియర్ న్యాయవాదులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ జిల్లా న్యాయమూర్తి ఎన్ ప్రేమలత సర్య్కులర్ జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. కమిటీ తమ నివేదికను 09-01-2026 లోపు లేదా అంతకు ముందు సమర్పించాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశించారని చెప్పారు.
News December 17, 2025
సిరిసిల్ల: బరిలో బాలింత.. హాస్పిటల్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్టునాయక్ తండాకు చెందిన భూక్య వెన్నెల ప్రవీణ్కు ఆరు రోజుల కిందట బాబు జన్మించాడు. కాగా, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కిష్టునాయక్ తండాలో 8వ వార్డ్ మెంబర్గా వెన్నెల బరిలో నిలిచారు. పోలింగ్ కావడంతో దవాఖాన నుంచి నేరుగా తన పసిబిడ్డతో పోలింగ్ కేంద్రానికి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


