News March 19, 2025

కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం

image

భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం వేద పండితులు కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేసి, స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించి, స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Similar News

News March 19, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤హత్తిబెళగల్ వీఆర్వోపై కర్నూలు జేసీ నవ్య ఆగ్రహం ➤ కూటమి ప్రభుత్వంపై ఆలూరు ఎమ్మెల్యే ఫైర్ ➤ జగన్, కేసీఆర్ తోడు దొంగలు, ఆర్థిక నేరగాళ్లు: బైరెడ్డి ➤ లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..! ➤ కోడుమూరు: వైసీపీ నాయకుడి మృతి ➤ ప్రజల మనసులో నుంచి వైఎస్ఆర్‌ను తొలగించలేరు: ఎస్వీ ➤ ప్రభుత్వాసుపత్రిలో అన్ని వైద్య సేవలు అందించాలి: ఆదోని ఎమ్మెల్యే

News March 19, 2025

కందుకూరు యువకుడికి గేట్‌లో మొదటి ర్యాంక్

image

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్‌లైన్ ద్వారా డేటా సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్‌లో MBBS పూర్తి చేశాడు.

News March 19, 2025

వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయండి: బల్దియా కమిషనర్

image

కమర్షియల్ ట్రేడ్ వేగవంతంగా వసూలు చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపుపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.

error: Content is protected !!