News February 12, 2025
కమలాపూర్లో అత్యధికం.. పరకాలలో అత్యల్పం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739335044811_18267524-normal-WIFI.webp)
హన్మకొండ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 129 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం కమలాపూర్ మండలంలో 90 పోలింగ్ కేంద్రాలు, శాయంపేటలో-61, ఆత్మకూరు-50, పరకాల-26, వేలేరు-29, దామెర-36, ఎల్కతుర్తి-59, నడికూడ-47, భీమదేవరపల్లి-69, హసన్పర్తి-40 ధర్మసాగర్-65, ఐనవోలు మండలంలో 59 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
Similar News
News February 12, 2025
సిర్గాపూర్: క్యాన్సర్తో యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353568846_20061001-normal-WIFI.webp)
సిర్గాపూర్ మండలం జమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని జీవులనాయక్ తండాకు చెందిన యువరైతు వడిత్య శ్రీనివాస్(29) క్యాన్సర్ వ్యాధితో మృతి చెందాడు. యువకుడు గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం ఉదయం శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో మరణించినట్లు చెప్పారు. కాగా, మృతుడికి ఏడాది కిందటే పెళ్లైనట్లు సమాచారం. యువకుడి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 12, 2025
రేపు గ్రూప్-2 హాల్టికెట్లు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355448835_81-normal-WIFI.webp)
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్లైన్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని, అందులోని సూచనలను గమనించాలని APPSC తెలిపింది. ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని సూచించింది.
News February 12, 2025
మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325851755_15795120-normal-WIFI.webp)
ఘట్కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్పేట, జవహర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.