News May 12, 2024
కరీంనగర్: MP ఎన్నికలు.. భారీ బందోబస్తు
ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. కమిషనరేట్కు చెందిన 2వేల మంది, 400 మంది కేంద్ర బలగాలు, 100 మంది ప్రత్యేక పోలీసుల బందోబస్తులో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా, ఓటర్లను తప్ప ఇతరులను లోనికి అనుమతించవద్దన్నారు.
Similar News
News October 7, 2024
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. కోడె మొక్కులు చెల్లించుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ లైన్లో దర్శనార్థం భక్తులు వేచి చూశారు.
News October 7, 2024
కరీంనగర్: గునుగు పూలకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన గుంటుక కాళిదాసు ఆదివారం ఉదయం గునుగు పూలు తేవడానికి వెళ్లాడు. పూలను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు.
News October 7, 2024
కరీంనగర్: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. కాగా జగిత్యాలలో 382 గ్రామ పంచాయతీలు అలాగే సిరిసిల్ల-255, కరీంనగర్-323, పెద్దపల్లి జిల్లాలో 266 పంచాయతీలు ఉన్నాయి.