News February 16, 2025
కరీంనగర్: ఈ నెల 18 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

బీసీ స్టడీ సర్కిల్ లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతాయని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థుల కోరిక మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి 18న ఉదయం 10 గంటలకు క్లాసులకు హాజరు కావాలని కోరారు.
Similar News
News January 20, 2026
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

దావోస్ వేదికగా గూగుల్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో TG CM రేవంత్ భేటీ అయ్యారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ల ప్రోత్సాహంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి ఫార్ములాను రేవంత్ వివరించారు.
News January 20, 2026
జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.
News January 20, 2026
భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం

<<18887766>>WEF<<>>లో ట్రంప్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏడుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు ఉండటం గమనార్హం. వీరిలో టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, భారతీ Airtel ఛైర్మన్ సునీల్ మిట్టల్, విప్రో CEO శ్రీనివాస్ పల్లియా, ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్ సంజీవ్, మహీంద్రా గ్రూప్ CEO అనీష్ షా, జూబిలెంట్ గ్రూప్ కో-ఛైర్మన్ భర్తియా ఉన్నారు. ఆరేళ్ల తర్వాత ట్రంప్ WEFలో పాల్గొంటున్నారు.


