News February 16, 2025
కరీంనగర్: ఈ నెల 18 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

బీసీ స్టడీ సర్కిల్ లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతాయని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థుల కోరిక మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి 18న ఉదయం 10 గంటలకు క్లాసులకు హాజరు కావాలని కోరారు.
Similar News
News January 4, 2026
రాయలసీమకు చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారు: గడికోట

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలతో చంద్రబాబు ద్రోహం బయటపడిందని తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కి చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు.
News January 4, 2026
కొన ఊపిరితో మచిలీపట్నం GGHకి వస్తే.. అటు నుంచి పైకే.!

MTMలోని GGH పేరుకే ‘సర్వజన’ ఆసుపత్రి అని, అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలు కాపాడే స్థితిలో లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వస్తే.. ఇక్కడ చికిత్స అందక ‘విజయవాడకు’ రిఫర్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లేలోపే రోగులు ప్రాణాలు వదులుతున్నారు. గుండెపోటు, గ్యాస్ట్రో, న్యూరో వంటి వాటికి ప్రత్యేక భవనం, పరికరాలు లేవని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News January 4, 2026
విజయవాడలో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభం

విజయవాడలోని PVP మాల్ రోడ్డులో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నాలుగో బ్రాంచ్ను పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామీజీ ఆదివారం ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. కచ్చితమైన పట్టు, సరసమైన ధరలకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, శ్రీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.


