News February 16, 2025
కరీంనగర్: ఈ నెల 18 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

బీసీ స్టడీ సర్కిల్ లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతాయని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థుల కోరిక మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి 18న ఉదయం 10 గంటలకు క్లాసులకు హాజరు కావాలని కోరారు.
Similar News
News January 5, 2026
IT షేర్ల పతనం.. కారణమిదే!

IT కంపెనీల ఫలితాల సీజన్ మొదలవనున్న తరుణంలో ఆ రంగంలోని సంస్థల షేర్లు కుప్పకూలాయి. నేడు Nifty IT ఇండెక్స్ ఏకంగా 2.5% పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం థర్డ్ క్వార్టర్లో IT కంపెనీల గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందన్న అంచనాలే దీనికి కారణం. అమెరికా, యూరప్ దేశాల్లో సెలవుల వల్ల బిజినెస్ తగ్గడం, కొత్త డీల్స్ రాకపోవడం IT సెక్టార్పై ఒత్తిడి పెంచుతోంది.
News January 5, 2026
తంతడి తీరంలో సముద్రపు నాచు సాగు ప్రారంభించిన కలెక్టర్

అచ్యుతాపురం మండలం తంతడి సముద్ర తీరంలో సముద్రపు నాచు మొక్కల సాగు కార్యక్రమాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. సముద్రపు నాచు ఆహారం, సేంద్రియ ఎరువులు, పశుగ్రాసాలు, చేపల మేతల తయారీకి ఉపయోగపడతుందన్నారు పర్యావరణానికి అనుకూలంగా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందన్నారు. తక్కువ పెట్టుబడితో 20-25 రోజుల్లో కోత వేసి లాభం పొందొచ్చన్నారు.
News January 5, 2026
HYD: ఆధార్ సెంటర్ ఎక్కడో ఈజీగా తెలుసుకోండి

గ్రేటర్ పరిధి రామంతాపూర్లో ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాసిన కథనంపై ఆధార్ సర్వీస్ యంత్రాంగం స్పందించింది. ఆధార్ అప్డేట్ చేసుకునేవారు పెరగటంతో రద్దీ ఏర్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. గ్రేటర్ HYD వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, వాటి వివరాలు తెలుసుకోవడం కోసం bhuvan.nrsc.gov.in/aadhaar/ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.


