News February 11, 2025
కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739256089574_1259-normal-WIFI.webp)
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.
Similar News
News February 11, 2025
ములుగు: 10 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739274438937_51702158-normal-WIFI.webp)
రానున్న పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎంఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎంఈవోలు, హెచ్ఎంలు కృషి చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ఇంటి వద్ద చదివేలా కృషి చేయాలన్నారు.
News February 11, 2025
మెదక్: శవం వద్ద మెడికల్ విద్యార్థుల ప్రమాణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739276933861_50139766-normal-WIFI.webp)
మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్కి ముందు వారికి విజ్ఞానాన్ని పంచే శవం వద్ద ప్రమాణం చేశారు. ఎల్లప్పుడు గౌరవాన్ని, విఘ్నతను కలిగి ఉంటామని కృతజ్ఞులమై ఉంటామని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రకుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిశంకర్, డాక్టర్ జయ, అనాటమీ విభాగం డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
News February 11, 2025
ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738463408246_893-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.22,507 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.