News February 5, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు 3 నామినేషన్లు

image

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఇద్దరు, టీచర్ స్థానానికి ఒకరు నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రారంభం నుంచి నేటి వరకు మొత్తం 8 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, నలుగురు టీచర్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. రెండింటికి కలిపి 12మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు వేశారు.

Similar News

News February 5, 2025

నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

image

నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.

News February 5, 2025

కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.

News February 5, 2025

మేం ముగ్గురం మిత్రులమే: గిల్

image

ఇండియా తరపున ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడినా అభినందించాలని భారత క్రికెటర్ శుభ్‌‌మన్ గిల్ అన్నారు. అభిషేక్ తన బాల్య మిత్రుడని, జైస్వాల్ సైతం మంచి స్నేహితుడని తెలిపారు. మా ముగ్గురి మధ్య ఎటువంటి పోటీతత్వం ఉండదని అన్నారు. ఇండియా కోసం ఆడేటప్పుడు ప్రతి మ్యాచ్ బాగా ఆడేలా ప్రయత్నించాలన్నారు. అంతేగాని ఒకరు బాగా ఆడకూడదని కోరుకోవటం సరికాదని శుభమన్ పేర్కొన్నారు.

error: Content is protected !!