News February 8, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ డీఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738999998363_1259-normal-WIFI.webp)
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ డీఎస్పీ మధనం గంగాధర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గీతా భవన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కలెక్టర్ పమేల సత్పత్తికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంబేడ్కర్ ఆశయసాధనే తన లక్ష్యమని గంగాధర్ తెలిపారు.
Similar News
News February 8, 2025
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు: కమిషనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739015352366_51939331-normal-WIFI.webp)
నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్ హనుమకొండ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. హంటర్ రోడ్డు, యూనివర్సిటీ, శ్రీ సాయి నగర్, వరంగల్, ఆరెపల్లి ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు. భవన నిర్మాణాలు చెప్పటానికి టీజీ బిపాస్ ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
News February 8, 2025
కేజ్రీవాల్పై స్వాతి కోపమే శాపమైందా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739018796449_1323-normal-WIFI.webp)
ఆప్ రాజ్యసభ ఎంపీ <<15398600>>ట్వీట్తో<<>> సొంత పార్టీతో తనకు విభేదాలేంటనే చర్చ జరుగుతోంది. గతేడాది CMఆఫీస్లో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు తనపై దాడి చేశాడని స్వాతి ఆరోపించారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ చర్యలు తీసుకోకపోగా కనీసం ఖండించలేదు. దీంతో ఆప్కు వ్యతిరేకంగా మారారు. ఢిల్లీలోని సమస్యలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసారు, యమునా నీటిసమస్యపై కేజ్రీవాల్ ఇంటికి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ వైఫల్యాన్నిఎండగట్టారు.
News February 8, 2025
ఊట్కూర్: ‘మాకు అల్పాహారం అరటి పండేనా.?’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739019889751_51771152-normal-WIFI.webp)
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందిస్తోంది. ఇందుకు ఒక్కో విద్యార్థికి రూ.15 ఖర్చు చేస్తోంది. కాగా ఊట్కూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు గత కొద్ది రోజులుగా ఒక అరటి పండు లేదా రూ.5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారని, ఇవి తమ ఆకలి తీర్చడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మెనూ ప్రకారం అల్పాహారం ఇవ్వడం లేదంటున్నారు.