News February 1, 2025

కరీంనగర్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

image

కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.

Similar News

News February 1, 2025

సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలి: బాపట్ల జేసీ

image

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ సభ్యత్వ నమోదు గురించి జిల్లా స్థాయి కమిటీ మీటింగ్ శనివారం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈ శ్రమ్ పోర్టల్‌లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు.

News February 1, 2025

NZB: ఫేక్ యాప్‌తో మోసం.. ఇద్దరి అరెస్ట్

image

ఫేక్ యాప్‌లో ఆఫర్ల పేరిట అమాయకులను మోసం చేస్తున్న షేక్ అమిర్, సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. MGI యాప్ పేరుతో దాదాపుగా 12 మంది బాధితుల నుంచి రూ.2.40లక్షల నగదును కాజేశారని పేర్కొన్నారు. ఇలాంటి యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీసు అధికారులను ACP అభినందించారు.

News February 1, 2025

కోటి మందికి ఊరట

image

కొత్త పన్ను విధానంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.12లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందని తాజాగా మీడియాతో వెల్లడించారు. పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. గతంలో రూ.8లక్షల ఆదాయం ఉన్నవారు రూ.30వేలు పన్ను కట్టేవారని గుర్తుచేశారు.