News June 16, 2024

కరీంనగర్: చిన్నారిపై హత్యచారం.. నిందితుడికి రిమాండ్

image

ఆరేళ్ళ చిన్నారిని ఓ యువకుడు హత్యచారం చేసిన విషయం తెలిసిందే. బిహర్‌కు చెందిన నిందితుడు వినోద్ మాజేను పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరుపర్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమంతం కుమార్ నిందితుడికి రిమాండ్ విధించారు. దీంతో అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

Similar News

News October 5, 2024

హుజూరాబాద్‌లో దారుణ హత్య

image

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజపల్లెలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 5, 2024

కోరుట్ల ఎస్సై- 2 శ్వేతను సస్పెండ్ చేసిన ఐజీ

image

జగిత్యాల జిల్లాలో కోరుట్ల పోలీస్‌స్టేషన్లో ఎస్సై-2 గా పనిచేసిన శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిపై గత నెల29న ఎస్సై శ్వేత చేయిచేసుకున్నారని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీస్‌శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా ఎస్సై-2 శ్వేతను సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రకటన జారీ చేశారు.

News October 5, 2024

కాటారం:అరుదైన అటవీ జంతువును తరలిస్తున్న ముఠా పట్టివేత?

image

అటవీ జంతువుల్లో అరుదుగా లభించే ‘అలుగు’ను తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం మేరకు అలుగును తరలిస్తున్న ముఠాను కాటారం మండలం మేడిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయసమాచారం. ఈముఠాలో కాటారం సబ్ డివిజన్‌కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, మరో ఇద్దరూ ఉన్నట్లు తెలిసింది. కాగా సదరు అలుగు విలువ రూ. 70లక్షల నుంచి రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం.